నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 17 : తంబళ్లపల్లె మండలంలోని హైస్కూల్లు, ప్రైమరీ పాఠశాలల్లోని 5142 విద్యార్థులకు గాను 5017 మంది 97. 57% విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు కోసువారిపల్లి పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా తెలిపారు. ఈ సందర్భంగా కోసువారిపల్లె హై స్కూల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆల్ బెండజోల్ మాత్రలు మింగడం వలన కడుపులోని నులిపురుగులు నశించి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఉండమన్నారు. ఈ మాత్రలు మింగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. అనంతరం ఆమె విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, హెడ్మాస్టర్, అధ్యాపకులు, సిహెచ్ఓ ఆదిలక్ష్మి, ఏఎన్ఎం ప్రమీల, మేల్ వర్కర్ కృష్ణా నాయక్, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News