నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సోమల : ఇద్దరు కన్న పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్యకు యత్నం చేసిన తల్లి బుజ్జమ్మ కటకటాల పాలైంది. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగిలు తాలూకా ఆలంగూరు గ్రామంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా సోమల మండలం వినాయకపురం ఎస్టీ కాలనీ నివాసులైన బుజ్జమ్మ, బాబు దంపతులు బతుకుదెరువు నిమిత్తం ప్రక్కరాష్ట్రము కు వలసవెళ్లి కూలీ పనులు చేసుకొంటూ తమ ఇద్దరు పిల్లలను పోసించుకొంటూ జీవనం సాగిస్తున్న తరుణం లో విధి వక్రీంచి ఇరవై రోజుల క్రితమే ఆక్సిడెంట్ లో భర్త బాబు మృతి చెందడం తో మానసికంగా కలత చెంది డిప్రెషన్ కు లోనైన బుజ్జమ్మ తన ఇద్దరు కూతుళ్ల 3 సంవత్సరాల సరస్వతి ని, ఒక సంవత్సరం వయస్సు లోనున్న చిన్నారి హేమశ్రీ లను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంటుండగా గమనించిన స్థానికులు ఆమె ను రక్షించి ఆసుపత్రి కి తరలించారు. ఘటన పై నంగిలి పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి పిల్లల మృతదేహలను పోస్టు మోర్టుమ్ అనంతరం బందువులకు అప్పగించి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తల్లి బుజ్జమ్మ ను రిమాండ్ నిమిత్తం తరలించనున్న పోలీసులు
Reporter
Namitha News