Sunday, 26 July 2026 09:54:08 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రాజనాల బండ ప్రమాణానికి సిద్ధమైన బి సి వై పార్టీ రాష్ట్ర నాయకుడు పూల ప్రేమ్ కుమార్

బీసీవై పార్టీ అధినేత పై అసత్య ప్రచారాలు మానుకోవాలి.

Date : 27 May 2026 05:52 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజనాల బండ ప్రమాణానికి సిద్ధమైన బి సి వై పార్టీ రాష్ట్ర నాయకుడు పూల ప్రేమ్ కుమార్.. బీసీవై పార్టీ అధినేత పై అసత్య ప్రచారాలు మానుకోవాలి.. బిసివై పార్టీ రాష్ట్ర నాయకులు పూల ప్రేమ్ కుమార్ అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలంలో సత్య ప్రమాణాలకు నెలవైన ప్రముఖ దేవస్థానం రాజనాల బండ సమీపంలో నేడు బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు పూల ప్రేమ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గత కొద్దిరోజులు ముందు సోషల్ మీడియాలో ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు ప్రవేటు పాఠశాలలో 25శాతం ఉచిత విద్య పేద విద్యార్థులకు వర్తించేలా, నాణ్యతమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు నివేదిక అందించడం జరిగింది. ఉమ్మడి కూటమి టిడిపి నాయకులు విద్యా శాఖ మంత్రి లోకేష్ బాబు నకు విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించే దిశగా కుటుంబ ప్రభుత్వం పనిచేయాలని కోరారు. దీనికి స్పందించిన పుంగనూరు టిడిపి సీనియర్ నాయకుడు అని పేరు చెప్పుకుంటున్న మధు రాయల్ అనే టిడిపి లీడర్ మా అధినేత బోడె రామచంద్ర యాదవు ని సోషల్ మీడియాలో భారత చైతన్య యువజన పార్టీ మరియు మా అధినేత బోడె రామచంద్ర యాదవ్ గురించి వారి కుటుంబ సభ్యుల ను అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది.వైసీపీ లోపయుక్త ఒప్పందాలు ఉన్నాయని బిసివై పార్టీ పై అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. దీనిపై స్పందిస్తూ మేము ఇచ్చిన వీడియో సందేశానికి సవాలుగా మధురాయల్ మీకు లోప యుక్త సంబంధాలు లేవని సత్య ప్రమాణాల నిలువుగా ఉన్న రాజనాల బండ వద్ద కు వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయమని సవాలు విసిరాడు. మరి అతను కోరిన విధంగానే మేము నేడు రాజనాల బండ ఆంజనేయస్వామి బండ వద్దకు వచ్చి ప్రమాణానికి సిద్ధం కాగా ఎవరైతే సవాలు విసిరారో మధు రాయల్ ఇక్కడికి హాజరు కాలేదని,ఇక్కడ గుడిలో ప్రతి శనివారం ప్రమాణాలు జరిపిస్తారని అర్చకులు తెలిపారు, వారికి ఇదే మా పిలుపు గా మళ్ళీ శనివారం ఇదేవిధంగా బీసీవై పార్టీ నాయకులుగా ప్రమాణానికి మేము మళ్ళీ ఇక్కడికే వస్తామని,ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో అతను కూడా దేవుని ఎదుట నిలబడి ఇదేవిధంగా ప్రమాణానికి రావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమం లో బిసివై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :