నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రవాణా, యువజన-క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డీనేటర్ దారం అనిత నేతృత్వంలో పార్టీ శ్రేణులు మంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ప్రాంత అభివృద్ధి, యువతకు అవకాశాలపై మంత్రితో నాయకులు చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Namitha News