నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 19: పోలీసు కార్యాలయంలో సోమవారం నాడు ప్రజాకవి శ్రీ యోగివేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు,* యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. "ప్రతి తెలుగు వాడి నోటా పలికే 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటం, సమాజానికి ఆయన అందించిన గొప్ప సందేశం. అత్యంత సరళమైన భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా నీతిని, ధర్మాన్ని బోధించిన మహనీయుడు వేమన అని, ఆయన సూక్తులు సమాజ మార్పుకు నిరంతరం మార్గదర్శకంగా ఉంటాయని" కొనియాడారు. వేమన పద్యాల్లోని జీవిత సత్యాలు నేటి కాలానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది కూడా క్రమశిక్షణతో కూడిన సమాజం కోసం వేమన చెప్పిన నైతిక విలువలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం వెంకటాద్రి గారు రాయచోటి డిఎస్పీ శ్రీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, ఆర్ఐ వి.జె. రామకృష్ణ, రాయచోటి రూరల్ సీఐ రోషన్, పలువురు పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వేమనకు అంజలి ఘటించారు.
Admin
Namitha News