నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 23 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో రైతులు, వినియోగదారులకు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి పెద్దపీట వేసి సఫలీకృతం అయినట్లు విద్యుత్ శాఖ (ఎస్ పి డి సి ఎల్) ఆపరేషన్ డి.ఈ గంగాధరం తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన కన్నెమడుగు సబ్ స్టేషన్ లో మర్రిమాకులపల్లి కు 11 కెవి బ్రేకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎక్కడా లో వోల్టేజ్ సమస్య లేకుండా పరిష్కారానికి పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. విద్యుత్ సబ్ స్టేషన్ ల పరిధిలో రైతులు, వినియోగదారుల సమస్యలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా విద్యుత్ సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారంలో అందుబాటులో ఉండి బిల్లుల వసూళ్లలో చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట పవర్ ట్రాన్స్మిషన్ డి ఈ, ఏడి గోవిందరెడ్డి, ఏఈ సురేంద్ర, శేషు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్,నాగేంద్ర, ఇంతియాజ్, నాగేంద్రబాబు, ఆయాజ్, కాలేశా, శేషు, నవాజ్, రమేష్, సురేష్, రాజశేఖర్, ప్రవీణ్ పాల్గొన్నారు.
Reporter
Namitha News