నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 17 : మారుమూల గ్రామాలలోని విద్యుత్ సమస్యలు క్షేత్రస్థాయి పరిష్కారానికి పల్లెబాట కార్యక్రమం దోహదపడుతుందని విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం సూచించారు. శుక్రవారం ఆయన ఎ.డి గోవిందరెడ్డి,ఏ.ఈ సురేంద్రతో కలిసి కోటకొండ పంచాయతీలో విద్యుత్ సిబ్బంది మూకుమ్మడిగా పల్లె బాట కార్యక్రమం కొనసాగించారు. పంచాయతీలోని గ్రామాలతోబాటు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ లైన్లు క్లియరెన్స్ తో పాటు రైతుల పొలాల వద్ద సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి వినియోగదారుడు సోలార్ విద్యుత్తు పై దృష్టి సారించి విద్యుత్ బిల్లులు చెల్లించే పని లేకుండా ఆదాయం పొందవచ్చునని హితవు పలికారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులు డిజిటల్ రూపంలో చెల్లింపులు వల్ల కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవకాశం ఉండదని సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల పనితీరుపై డిఇ వినియోగదారులను, రైతులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News