Sunday, 26 July 2026 09:59:06 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్

బోయపల్లెలో ఆధునిక పాల కేంద్రం ప్రారంభం

Date : 19 June 2026 10:19 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : పాల సేకరణలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న శ్రీజ పాలడైరీ శిగలో మరో అధునాతన పాలసేకరణ కేంద్ర మోడల్ కంటైనర్ ప్రారంభించడం హర్షనీయమని శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప కొనియాడారు. శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట ఏరియా సిటిఎం సిసి పరిధిలోని బోయపల్లి తో పాటు బి.కొత్తకోట మండలం కుమ్మరపల్లి లలో జైకా మరియు ఎన్.డి.డి.బి సహకారంతో ఏర్పాటు చేసిన మోడల్ కంటైనర్లను క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఏరియా మేనేజర్ మాట్లాడుతూ శ్రీజ సంస్థ ద్వారా పాల ఉత్పత్తి దారులకు అందుతున్న వివిధ సేవలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సభ్యత్వ ప్రయోజనాల గురించి వివరించారు. క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీజ డైరీకి రోజు కు తొమ్మిది లక్షల లీటర్ల పాలు వస్తున్నాయని అందులో తంబళ్లపల్లి నియోజకవర్గం లో 80 వేల లీటర్లు వస్తున్నట్లు చెప్పారు. జులై నెలలో పాడి రైతులకు అందించాల్సిన బోనస్ అలాగే సబ్సిడీ పథకాలు, బయోగ్యాస్ యూనిట్లు, పశువుల కోసం రబ్బరు మ్యాట్లు వినియోగంపై విశదీకరించారు. అతి త్వరలో మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలమిత్ర సురేష్ పాడి రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఐ సి. కేశవ, శ్రీజ సూపర్వైజర్లు సురేష్, చిట్టిబాబు, బోయపల్లి శ్రీజ వాళ్ళ డైరీ సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :