Sunday, 26 July 2026 08:24:25 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఐ.టి. హబ్ ను వెనుకబడిన ప్రాంతమైన మదనపల్లి కి తీసుకురావాలి - మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్

Date : 03 January 2026 02:28 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్.ముఖ్యమంత్రి పదవులతో చంద్రబాబు, వైయస్ కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగాయి.ఆరు సంవత్సరాలు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా రాయలసీమ అభివృద్ధికి ఏమి చేశారు? చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాయలసీమను అభివృద్ధి చేసింది సున్నా. మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి మాటలతో కాలం గడిపారు.కడప జిల్లా నుంచి వైయస్ కుటుంబం 11 ఏళ్లు ముఖ్యమంత్రి పదవులు అనుభవించింది. రాయలసీమకు ఏమైనా చేశారా? చేసుంటే చెప్పండి. కర్నూలు నుంచి విజయభాస్కర్ రెడ్డి, దామోదరం సంజీవయ్యలు సీఎం అయ్యారు. 40 సంవత్సరాలు రాయలసీమ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అయినా సొంత ప్రాంతాన్ని పట్టించుకోలేదు.చంద్రబాబు కుటుంబం, వైఎస్ కుటుంబాలు ముఖ్యమంత్రి పదవుల వల్ల బాగుపడ్డారు. ఆర్థికంగా బాగా ఎదిగాయి. తిరుపతి నుంచి అనంతపురం వరకు, అనంతపురం నుంచి మదనపల్లె వరకు ప్రయాణం చేస్తే, రాళ్లు, చింత చెట్లు కనిపించాయి. నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగాలు లేక, ప్రస్టేషన్లో గంజాయికి అలవాటు పడుతున్నారు.బి ఎన్ యుగంధర్ ఐఏఎస్ అనే వ్యక్తి అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామంలో పుట్టారు. ఆయన రాజంపేటలో పెళ్లి చేసుకున్నారు. తాడిపత్రి తండ్రి, రాజంపేట తల్లికి పుట్టిన బిడ్డే మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల. రాయలసీమ ముద్దుబిడ్డ ఆయన.సత్య నాదెళ్ల వల్లే రాయలసీమ, రతనాలసీమగా మార్చే శక్తి అతనకే ఉంది. నిన్న నేను ( చింతామోహన్) సత్య నాదెళ్ల గారికి ఫోన్ చేసి, మాట్లాడాను. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. ఉపాధి హామీ చట్టం కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారి ఆలోచన.యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో మార్పు తీసుకొచ్చేందుకు ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చాము. ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ గారి పేరును పెట్టాము. చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్న బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తీసివేసింది. ఇది దేశద్రోహం.100% కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉండగా, బిజెపి తెచ్చిన బిల్లు వల్ల, 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోవాల్సి ఉంటుంది. కూలీ రేట్లు కూడా భూస్వాములకు ఉపయోగపడేలా మార్పులు చేశారు.ఈ విలేకరులు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్, రవి, యమలా సుదర్శన్, డాక్టర్,SK భాషా, మీనాకుమారి, ముభారక్, మహబూబ్ పీర్, శరత్, పాలేటి నాగరాజు..బి. నాగరాజు, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: