నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 05 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఏం.సి.ఏ మరియు ఏం.బి.ఏ చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ నేషనల్ స్కాలర్షిప్స్ లభించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. నేషనల్ స్కాలర్షిప్స్ ద్వారా నిరుపేద నేపథ్యాల నుండి ప్రతిభావంతులైన మరియు ఆర్థికంగా అవసరమైన విద్యార్థులకు మద్దతునిచ్చే లక్ష్యంతో 7 మంది ఏం.సి.ఏ చదువుతున్న ఒక్కో విద్యార్థికి ౩,00,000 మరియు 2 మంది ఏం.బి.ఏ విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹ 1,50,000 చొప్పున 9 మంది విద్యార్థులకు మొత్తం ₹ 24,00,000 రూపాయలు లభించినట్లు తెలిపారు. ఉపకారవేతనాలు అందుకున్న విద్యార్థులను యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ఏం.సి.ఏ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్, స్టూడెంట్ అఫైర్స్ సీనియర్ మేనేజర్ డాక్టర్ పి.అథాహర్ సమీనా, రాగ దీప్తి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేసారు
Reporter
Namitha News