నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 25 : పుంగనూరు పట్టణం లో నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సమావేశం నిర్వహించిన జనసైనికులు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సమావేసం లో పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, కార్యకర్తల వివరాల సేకరణపై చర్చించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమం పథకాలను ప్రతీ ఓటర్ కు తెలిసేలా చేస్తూ మన పార్టీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు, జనసైనికులకు పిలుపునిచ్చారు
Reporter
Namitha News