నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత గుండెజబ్బు చికిత్స శిబిరం ఈనెల 3న నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కోలారుకు చెందిన ఆర్ఎల్ జాలప్ప హార్ట్సెంటర్ వైద్యులచే శిబిరం ఉదయం 10 గంటల నుంచి సరళ హ్గమియో ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. గుండెజబ్బులు కలిగిన వారు తమ ఆధార్ లేదా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని శిబిరానికి హాజరుకావాలెనని కోరారు.
Reporter
Namitha News