నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 08 : గ్రామాలలో చెత్త సేకరణలో గ్రీన్ అంబాసిడర్లు అశ్రద్ధ వహిస్తే స9హించేది లేదని ఇన్చార్జి ఎంపిటిఓ ఎంవి ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఏవో థామస్ రాజా తో పలు పంచాయతీలలో పర్యటించి ప్రతిరోజు ఉదయాన్నే చెత్త సేకరించి తడి పొడి చెత్త డంపింగ్ యార్డ్ కు చేర్చి ఎరువు తయారీ చేయాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల ద్వారా పంచాయతీ కార్యదర్శి తోపాటు సచివాలయ సిబ్బంది గ్రామాలలో ప్రజలలో అవగాహన పెంచి ప్రభుత్వ స్వచ్ఛంద లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించాలన్నారు
Reporter
Namitha News