నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గంజాయి ముఠా ఆటకట్టించిన పోలీసులు - పొలంలో సాగు..బి.కొత్తకోటలో విక్రయం - వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె : అన్నమయ్య జిల్లాలో గంజాయి సాగు చేస్తూ,విక్రయిస్తున్న ఒక భారీ ముఠా ఆటకట్టించారు పోలీసులు.మంగళవారం మదనపల్లి డిఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా పీటీఎం మండలం మల్లెల గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి తన పొలంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నాడు.ఆ పంటను డబ్బు ఆశ చూపి సురేంద్ర,అఫ్రీద్,పురుషోత్తం,ఆదిల్ అనే యువకుల ద్వారా మార్కెట్లోకి తరలిస్తున్నాడు.సమాచారం అందుకున్న బి.కొత్తకోట పోలీసులు నిఘా ఉంచి,ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడుగా పట్టుకున్నారు.వారి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎన్.డి.పీఎస్ చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేసి మత్తుపదార్థాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.సాగు చేసినా,అమ్మినా జైలు శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించారు.ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబరిచిన మదనపల్లి డిఎస్పీ మహేంద్ర,బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి,క్రైమ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.
Reporter
Namitha News