నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 11 : బి.కొత్తకోట పట్టణం లోని జ్యోతి చౌక్ వద్ద లయన్స్ క్లబ్, హార్స్లీ హిల్స్ శాఖ వారి ఆధ్వర్యంలో మధుమేహ పరీక్ష శిబిరం ను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సుమారు 55 మంది ప్రజలు తమ రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకొని చికిత్స పొందారు. ఇక ప్రతి నెలలో రెండవ మంగళవారం నాడు ఇలాంటి మధుమేహ పరీక్షా శిబిరాలు నియమితంగా నిర్వహించబడతాయని లయన్ కోగర మొహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రాణి, బొమ్మసాని నవీన్, ఎన్. హరిబాబు పాల్గొన్నారు
Reporter
Namitha News