నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఫిబ్రవరి 22 : రామసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీడీవో గారి ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా హాజరైన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష,ఎంపీటీసీ సభ్యులు వారి ప్రాంతం లో చేయాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సమావేశం లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ సభ్యులు చేసిన విన్నపాలను, సభ్యులు ఆమోదం తెలిపిన ప్రజా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని స్థానిక అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహన్ బాష. ప్రతి ఒక్క అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాసమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారికి సేవలందించాలని సూచించారు. ఈ సమావేశం లో అన్నీ శాఖల మండల అధికారులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు
Admin
Namitha News