నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 08 ః తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండల్లో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామిని చిత్తూరు జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున లు సీఈఓ కు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను పరిశీలించి మల్లయ్య కొండ శివాలయ పునర్నిర్మాణం, భక్తులు నిర్మించిన అన్నదాన సత్రం, గౌరమ్మ గుడి, స్వామి పుష్కరిణి పరిశీలించారు. ఆయన వెంట డిఎల్డిఓ లక్ష్మీపతి, ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, వైకాపా నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News