నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు జిల్లాల పునరవిభజన ప్రక్రియ లో భాగంగా సబ్ కమిటీ ఏర్పాటు, సబ్ కమిటీ తీర్మానం మంత్రివర్గం ఆమోదం తో మదనపల్లి జిల్లా కేంద్రం గా చేస్తూ మదనపల్లి జిల్లా గా నేడు ప్రిలిమినరీ గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం. ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గం లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను మదనపల్లి జిల్లా లోకి కలుపుతూ గెజిట్ విడుదల చేశారు. పుంగనూరు నియోజకవర్గం లోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు చిత్తూరు జిల్లా లో నున్న వీటిని చిత్తూరు లోనే ఉంచేస్తారా...? అన్నది రెండు మండలాల ప్రజలు అర్థం కాక తలలు పట్టుకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసి పలమనేరు రెవిన్యూ డివిజన చేయగా డివిజన్ కేంద్రం కు వెళ్లాలంటే చాలా దూరం కారణం గా పోరాటం చేయగా పరిపాలన సౌలభ్యం కోసం చిత్తూరు రెవిన్యూ డివిజన్ లోకి మార్పు చేసిన వైసీపీ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వం ఒకే నియోజకవర్గం లోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల పరిస్థితి ఏంటని ఆందోళనలు చెందుతున్న ప్రజలు
Reporter
Namitha News