నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 08 : సిజెఎఫ్ఎస్ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలంటూ ఆత్మకూరు నియోజకవర్గం జనసేన ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఆత్మకూరు ఆర్డీవో బి.పావని కి వినతిపత్రం అందించారు.. అనంతరం నలిశెట్టి. శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధిష్టానం పిలుపుమేరాకు సిజెఎఫ్ఎస్ భూములను కోల్పోయిన రైతులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం అందించామని అన్నారు. సిజెఎఫ్ఎస్ భూములకు గతంలో కూటమి ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయగా ఆ తర్వాత వచ్చిన వైయస్ఆర్ సీపీ పార్టీ ఆ ప్రతిపాదనను తుంగలో తొక్కి సిజెఎఫ్ఎస్ పొలాల రైతులను ఇబ్బంది గురిచేసిందని అందుకోసమే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 60,505 రైతు కుటుంబాలకు చెందిన 66,276 ఎకరాలకు సంబంధించిన రైతాంగ సమస్యపై ఆత్మకూరు ఆర్డివో గారిని కలిసి ఆ భూములకు పట్టాలు ఇవ్వవలసిందిగా నేడు తమ పార్టీ తరఫున విజ్ఞప్తి చేశామన్నారు.. ఈ కార్యక్రమంలో వీరితోపాటు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పేమల.సురేంద్ర, పార్టీ నేతలు గడ్డం వంశీ, పాటి. రాఘవ, నాగరాజు యాదవ్, మదన్ యాదవ్, మావిళ్ళ.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News