నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 20 ః తంబళ్లపల్లె మండలం పరసతోపు పంచాయతీ కురువపల్లెలో నిర్మించిన సిసి రోడ్డు ఆదర్శవంతంగా ఉందని పంచాయతీరాజ్ డిఇ విజయ్ మోహన్ కొనియాడారు. మంగళవారం ఆయన సిసి రోడ్డు నిర్మాణాలు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో జరిగే సిసి రోడ్ల నిర్మాణ పనులు ఇదే స్ఫూర్తితో నాణ్యత లోపం లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏ ఈ రమణ, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News