నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 : తంబళ్లపల్లె మండలం లో రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ మంత్రి యువ గళం రథసారథి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు విద్యాసామాగ్రి (పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు) పంపిణీ చేశారు. గోపి దిన్నె దళితవాడ, ఎంపీపీ స్కూళ్లలో తరగతి విశ్రాంతి సమయంలో పుస్తకాల పంపిణీ తోబాటు కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్ కు విద్యార్థుల విద్య, యువత భవిష్యత్తు కోసం అలు పెరగని కృషి చేస్తున్నట్లు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన రాష్ట్రానికి దిక్సూచిగా,తండ్రికి మించిన తనయుడిగా ప్రజాభిమానం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్,మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డి, రాజంపేట బిసి కార్యవర్గ సభ్యుడు సోమశేఖర్, సీనియర్ నాయకుడు మీసాల భాస్కర్ నాయుడు,జయరాం రెడ్డి, చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి,వార్డు మెంబర్ జగదీష్, గ్రామ కమిటీ సభ్యుడు భాస్కర్, సోమశేఖర్, భాస్కర్ నాయుడు, జయరాం రెడ్డి, లోకేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News