నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 31 : తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని అలాంటిది పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హెచ్చరించారు. బుధవారం తంబళ్లపల్లె మండల కేంద్రం అంబేద్కర్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూటమి సారథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు విశాఖలో సాఫ్ట్వేర్ రంగం లో దూసుకుపోతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు తోపాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. పార్టీ పదవులు ఊరికే రావని పార్టీ కోసం కష్టపడి త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే సహించనని ఏ కార్యక్రమం జరిగిన ఏకతాటిపై జరగాలని సూచించారు. తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీకి కంచుకోటని అలాంటిది మనలో గ్రూపు రాజకీయాలు చేస్తే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదని హెచ్చరించారు. నాయకులు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని పరిష్కారానికి కృషి చేస్తానని ఐకమత్యంతో టిడిపి కుటుంబ సభ్యులు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, ములకలచెరువు సింగల్ విండో ప్రెసిడెంట్ త్యాగరాజు,రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి,పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్,బిసి నాయకుడు పురుషోత్తం, క్లస్టర్ ఇన్చార్జి బేరి శ్రీనివాసులు,రైతు నాయకుడు వెంకట్ రెడ్డి, సోమశేఖర్,తెలుగు యువత నరసింహులు, వీరాంజనేయులు, కాలా నారాయణ, ఎస్టీ నాయకుడు వెంకటరమణ, రామచంద్ర , ఆనంద్ రెడ్డి , కందిమడుగు సోమశేఖర్ ,సురేంద్ర , మండలములోని వందలాది గా టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News