నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఫిబ్రవరి 05 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన ఏడవ తరగతి విద్యార్థి సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి పెన్కాక్ సిలాట్ అనే యుద్ధకళ పోటీలో నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గొని జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించిన విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఆర్డీవో బి.పావని గారు నేడు సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి మరియు వారి కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి ఆహ్వానించి సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి ను అభినందిస్తూ ఘనంగా సత్కరించి ప్రోత్సాహక బహుమతిని అందించారు. వీరితోపాటు వీరి కోచ్ సాయి ను మరియు విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్, జలీల్ , సయ్యద్ ఆయిషా బేగం మరియు ఈ విద్యార్థి చదివే మేధా స్కూల్ కరస్పాండెంట్ సుబ్బయ్య ను ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా ఆర్డీవో బి పావని మాట్లాడుతూ ఎంతో కష్టతరమైన వైవిధ్యమైన యుద్ధకళ పోటీలో జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించడం ఆత్మకూరుకు గర్వకారణం అని ఇటువంటి పతకాలు మరిన్ని సాధించి ఆత్మకూరుకు, నెల్లూరు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు నిలబెట్టాలని ఆర్డిఓ అభినందించారు. తమను అభినందించిన ఆర్డిఓ మేడం గారికి మొహిద్దిన్ ఖాదిరి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుతూ వారిని సత్కరించారు
ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డను ఘనంగా సత్కరించిన ఆర్డీవో గారికి రుణపడి ఉంటామని అలాగే అవార్డు అందుకున్న సందర్భంగా తమను అభినందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో తండ్రి జలీల్ పాఠశాల సిబ్బంది ఇందిరా, రహీం తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News