నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 16 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తంబళ్లపల్లె ఏపీ మోడల్ స్కూల్ లో 121 మంది విద్యార్థులకు 121 మంది, జిల్లా పరిషత్ హైస్కూల్లో 105 మందికి 105 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులను పోలీసులు హాల్ టికెట్లను పరిశీలించి పరీక్ష గదుల్లోకి పంపించారు.మోడల్ స్కూల్లో ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్ గా సుధాకర్ రెడ్డి, డి ఓ రామకృష్ణ, జడ్పీ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్ గా శ్రీనివాస్, డిఓ గా సుధాకర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎస్సై అనిల్ కుమార్ సారథ్యంలో బందోబస్తు తోపాటు కోసువారిపల్లి పీహెచ్సీ మెడికల్ సిబ్బంది, తాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది.
Reporter
Namitha News