Sunday, 26 July 2026 07:19:02 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మదనపల్లె టెర్రకోట బొమ్మలకు లకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు

మిట్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో జి.ఐ. ట్యాగ్ కోసం దరఖాస్తు

Date : 08 February 2026 08:50 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 08 : మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లె లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) వారు మదనపల్లె టెర్రకోట మరియు కుండల తయారీ లకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ కోసం చెన్నై జీఐ రిజిస్ట్రీకి సమర్పించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. చేతితో తయారు చేయబడిన ఉపయోగపడే మరియు అలంకరణ మట్టి పాత్రలకు ప్రసిద్ధి చెందిన మదనపల్లె యొక్క టెర్రకోట మరియు కుండల తయారీ కి మదనపల్లె ఒక ప్రత్యేక కేంద్రం అని అన్నారు. మదనపల్లె టెర్రకోట్-టా మరియు కుండల దరఖాస్తును మదర్ ఇండియా టెర్రకోట్-టా ఆర్టిసాన్స్ మ్యూచువల్లీ ఎయిడ్ కో-ఆపరేటివ్ సొసైటీ తరుపున దాఖలు చేసినట్లు ఆయన అన్నారు. ఈ క్రాఫ్ట్ సమీపంలోని నది ఒడ్డులు మరియు గుంటల నుండి సేకరించిన స్థానిక ఎరుపు, పోరస్ బంకమట్టిని ఉపయోగిస్తు, చేతివృత్తులవారు మన్నిక కోసం రెండు నుండి మూడు బంకమట్టిని కలుపుతారు అని ఆయన అన్నారు. ఈ క్లస్టర్‌లో మదనపల్లె మరియు సమీపంలోని పలమనేరు ప్రాంతాలలో దాదాపు 287 మంది చేతివృత్తులవారు ఉన్నారు అని అన్నారు. సందర్బంగా యూనివర్సిటీ మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ యొక్క చురుకైన ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమం లో అడ్విసెర్ (ఆర్ &డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్ &డి) డాక్టర్ పి. శివయ్య, అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :