Sunday, 26 July 2026 09:04:55 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లో అవుట్‌ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై జాతీయ వర్క్ షాప్

Date : 05 December 2025 08:51 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకుల కోసం “అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ (OBE)” పై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మరియు పాలిటెక్నిక్ అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యా నాణ్యతను పెంపొందించడంలో ఎన్.బి.ఏ మరియు న్యాక్ గుర్తింపు ఎంతో కీలకమని, ఎన్.బి.ఏ ప్రధానంగా టెక్నికల్ ప్రోగ్రామ్‌లకు అక్క్రిడిటేషన్ ఇస్తూ, కోర్సులు అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్నాయా అనే అంశంపై దృష్టి పెడుతుంది అని అన్నారు. న్యాక్ గుర్తింపు మాత్రం మొత్తం సంస్థ పనితీరును అంచనా వేసి, పాఠ్య ప్రణాళిక, బోధన-అభ్యాసం, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థి సేవలు వంటి అంశాలను పరిశీలించి రేటింగ్ ఇవ్వడం ద్వారా అక్క్రిడిటేషన్ పొందిన కళాశాలలకు పరిశ్రమలతో అనుబంధం పెరగడం, ఉద్యోగావకాశాలు మెరుగు పడడం, ప్రభుత్వ నిధులు పొందే అవకాశం పెరగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపకులు పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలియడం ద్వారా బోధనా నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు బోధనా విధానాల్లో నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల నేర్పుదల పద్ధతులు, కోర్స్ అవుట్‌కమ్, ప్రోగ్రామ్ అవుట్‌కమ్ రూపకల్పన, అకడమిక్ అక్వాలిటీ మెరుగుదల వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల నుండి 80 మందికి పైగా అధ్యాపకులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :