నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 05 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ మరియు ఫిలిం మేకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ మూవీ వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మూవీ ప్రొడ్యూసర్ అరవింద్ మండెం మరియు డైరెక్టర్ మధుదీప్ పాల్గొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ నేటి ఇంజినీరింగ్ విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో కూడి ఉండాలని తెలిపారు. ఇంజినీరింగ్లో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం సినిమా రంగంలో ఆధునిక టూల్స్ వినియోగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని, నిరంతర సాధన, సరైన మార్గదర్శనం మరియు ప్రాక్టికల్ అనుభవం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుని ఇష్టమైన రంగంలో విజయం సాధించవచ్చు అని అన్నారు. చిత్ర పరిశ్రమ పై ఆసక్తి గల విద్యార్థులకు పరిశ్రమల్లో జరుగుతున్న ప్రక్రియలను వీడియో రూపంలో ఎలా చూపించాలి, టెక్నికల్ విషయాలను సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. కెమెరా హ్యాండ్లింగ్, వీడియో ఎడిటింగ్, ప్రొడక్షన్, ప్రెజెంటేషన్ స్కిల్స్ వంటి అంశాలు నేర్చుకోవడం ద్వారా సినీ పరిశ్రమలో ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ కన్వీనర్ వై.ప్రదీప్ కుమార్, ఫిలిం మేకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ రియాజ్ అలీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News