నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ క్యాంపస్ నందు ఎంబీఏ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం 24-01-2026 ఘనంగా ఆసంతు 26 ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఎం. బి ఏ లో విద్యార్థుల కు ప్లేస్ మెంట్లు టాప్ కంపెనీ ల లో వస్తున్నాయని దానికి తగినట్లుగ తమ లైఫ్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి అని అకాడమిక్స్ లో ఉత్తమ ఫలితాలు సాదించాలి అని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ విశ్వం కాలేజీ ఎం. బి. ఏ విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ కు దీటుగా పోటీ లో తమ నైపుణ్యలను పెంచుకోవాలి అని తెలిపారు. డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డా. మీనాజ్ మాట్లాడుతూ ఎం. బి. ఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులు కు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించి తద్వారా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు బాగా ఉండాలని అకడమిక్స్ లో మంచి ఉతీర్నత సాధించాలని, సీనియర్స్ ను గౌరవించి వారి సలహాలను తీసుకోవాలి అని తెలిపారు.ఆటల పోటీలలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్, డా. డి. రమణా రెడ్డి మరియు వైస్ ప్రిన్సిపాల్ డా. గౌస్ భాషా ప్రశంస పత్రాలు, మెడల్స్ ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి.ఎస్. గౌస్ బాషా, డా. బి.డి. వెంకటరమణ రెడ్డి, డీన్స్, హెస్.ఓ.డీస్ మరియు అధ్యాపకులు, ఎంబిఏ విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News