నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 28 : ప్రతి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఎగురవేయాలని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ తంబళ్లపల్లె లో జరిగే నియోజకవర్గ టిడిపి ఆవిర్భావ దినోత్సవానికి ఆరు మండలాల నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు టిడిపి ప్రముఖ నాయకులు హాజరవుతారని నియోజకవర్గంలోని టిడిపి కుటుంబ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు సిద్ధమ్మ, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, బిసి నేత పురుషోత్తం, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల రెడ్డి, హై స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్, కాలా నారాయణ, రామాంజులు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News