Monday, 27 July 2026 01:00:20 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మల్లయ్య కొండల మైనింగ్ మానవాళికి పెనుముప్పు - బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు జల్లా లలితమ్మ

Date : 29 May 2026 08:48 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 ః లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం ముక్కంటి నిలయాలుగా నిలిచిన తంబళ్లపల్లె (సాధు, ఇనుము, మల్లయ్య) మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది జీవరాశులు, మూగజీవాలు, వేలాదిమంది అటవీ శివార్ల ప్రజలు జీవనోపాధి కోల్పోవడంతో పాటు భవిష్యత్తులో పర్యావరణం కాలుష్యమై మానవాళికి పెనుముప్పు ఏర్పడుతుందని బాలల హక్కుల ప్రజా ధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు జల్లా లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు ఆ మహా శివుడు సాదుకొండ నుండి సొరంగ మార్గంలో ఇనుము కొండ ద్వారా మల్లయ్య కొండ చేరి స్థిరపడినట్లు పురాణాలు చెబుతున్నాయని దీంతోపాటు స్థానిక లక్షలాది శివ భక్తుల మనోభావాలను ప్రభుత్వాలు గుర్తించాలని ఈ ప్రాంతంలో మైనింగ్ చేపడితే వాతావరణ కాలుష్యం, దుమ్ము ధూళి తో అనారోగ్యాలు, భూములు నిస్సారమై పంటలకు పనికి రాకుండా పోయి ఎడారి ప్రాంతం లా మారుతుందని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. నేడు తంబళ్లపల్లె ప్రాంతానికి మల్లయ్య కొండలు పెట్టని కోటలా అటవీ ప్రాంతం పచ్చటి పర్యావరణం, లక్షలాది వన్యప్రాణులు, పశు పక్షాదులు, జీవరాసులు ఆశ్రయం కోల్పోవడంతో పాటు ఈ కొండలను నమ్ముకున్న కొండ శివారు ప్రాంతాలలోని వందలాది గ్రామాల ప్రజలు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. మల్లయ్య కొండ ఇప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి వైపు నడిచి లక్షలాదిమంది భక్తులకు మహాశివుడు ఆరాధ్య దైవంగా నిలిచాడని ఇలాంటి పవిత్రమైన కొండలను మైనింగ్ కు అప్పజెప్పడం స్థానిక ప్రజలకు శరాఘాతంగా తయారవుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మైనింగ్ కార్యక్రమాలను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: