Sunday, 26 July 2026 03:52:17 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పిచ్చలవాండ్లపల్లి చెరువు సప్లై ఛానల్ పూడికతీతకు ఎమ్మెల్యే షాజహాన్ శ్రీకారం

ఎమ్మెల్యే షాజహాన్ బాష భూమి పూజ

Date : 29 May 2026 07:03 PM Views : 69

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పిచ్చలవాండ్లపల్లి చెరువు సప్లై ఛానల్ పూడికతీతకు శ్రీకారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ మదనపల్లె గ్రామీణ మండలం పొన్నూటపాలెం పంచాయతీ పరిధిలోని పిచ్చలవాండ్లపల్లి చెరువు సప్లై ఛానల్ పూడికతీత పనులకు జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు. ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో తాజ్మస్రూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జేసీబీ ద్వారా మట్టి తొలగింపు పనులను ఎమ్మెల్యే ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా చెరువులు, సప్లై ఛానళ్ల పూడికతీత పనులను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సప్లై ఛానల్ పూడికతీత పనులకు స్వచ్ఛందంగా జేసీబీ అందించిన వేణు, దిలీప్, మంజునాథ్‌లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర చేపడుతున్న పూడికతీత పనులకు సహకరిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, చిప్పిలి గురునాథ యాదవ్, నవాజ్, సోమశేఖర్ నాయుడు, జె.వి.రమణ, రాయచోటి శశికుమార్, రెడ్డి రాయల్, చల్లా, శ్రీనివాసులు నాయక్, ఇక్బాల్, డిప్యూటీ ఎంపీడీవో తిరుపాల్ నాయక్, సచివాలయ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :