నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పిచ్చలవాండ్లపల్లి చెరువు సప్లై ఛానల్ పూడికతీతకు శ్రీకారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ మదనపల్లె గ్రామీణ మండలం పొన్నూటపాలెం పంచాయతీ పరిధిలోని పిచ్చలవాండ్లపల్లి చెరువు సప్లై ఛానల్ పూడికతీత పనులకు జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు. ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో తాజ్మస్రూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జేసీబీ ద్వారా మట్టి తొలగింపు పనులను ఎమ్మెల్యే ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా చెరువులు, సప్లై ఛానళ్ల పూడికతీత పనులను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సప్లై ఛానల్ పూడికతీత పనులకు స్వచ్ఛందంగా జేసీబీ అందించిన వేణు, దిలీప్, మంజునాథ్లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర చేపడుతున్న పూడికతీత పనులకు సహకరిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, చిప్పిలి గురునాథ యాదవ్, నవాజ్, సోమశేఖర్ నాయుడు, జె.వి.రమణ, రాయచోటి శశికుమార్, రెడ్డి రాయల్, చల్లా, శ్రీనివాసులు నాయక్, ఇక్బాల్, డిప్యూటీ ఎంపీడీవో తిరుపాల్ నాయక్, సచివాలయ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News