నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 05 : నేటి సమాజంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతగా ప్రతి ఒక్కరు పాటించాలని ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ సూచించారు. శుక్రవారం పరసుతోపు పంచాయతీ కస్తూరిబా బాలికల గురుకులంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏపీవో అంజనప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేడు పర్యావరణ కాలుష్యంతో మానవాళి వ్యవసాయం, ఆరోగ్యం తో పాటు పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సమస్యను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కల పెంపకం తో పాటు సంరక్షణ పై దృష్టి సారించాలన్నారు. మొక్కల పెంపకం, ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణతో పర్యావరణాన్ని కాపాడుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం గురుకుల ప్రాంగణంలో మొక్కలు నాటారు. డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ప్రిన్సిపాల్ ముని వెంకటమ్మ, కార్యదర్శి హరి ప్రసాద్, ఎంటిసీ ఆంజనేయులు, టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, బి ఎఫ్టి భూదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News