నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 14 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో శనివారం జనసేన మండల నాయకులు గోల్లపల్లి సిద్ధమల్ రెడ్డి, టిడిపి కూటమి నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. క్రాస్ రోడ్ లో తంబళ్లపల్లె జనసేన ఇన్చార్జ్ పోతుల సాయినాథ్ జనసేన పార్టీ పతాకావిష్కరణ చేసి అనంతరం భారీ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సాయినాథ్ ను మండల జనసేన, కూటమి నాయకులు పూల మాలలు, దుస్సాలవులతో ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీ వర్ధిల్లాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, పోతుల సాయినాథ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలకు హోరెత్తించారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రజ లు అన్ని రంగాలలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు ఐకమత్యంతో వైకాపా ను చిత్తుగా ఓడించాలన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎద్దుల నరసింహులు, నరేందర్ రెడ్డి, సురేష్, మండల అధ్యక్షుడు కరుణాకర్, మురళి, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బేరిశ్రీనివాసులు, పురుషోత్తం, నరసింహులు, వీరాంజనేయులు,రామచంద్ర, మ్యూజికల్ శివ, మణి, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News