Sunday, 26 July 2026 11:33:45 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పవన్ కళ్యాణ్ ప్రజాదరణను చూసి భయపడుతున్నారా.?

Date : 02 June 2026 07:05 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పవన్ కళ్యాణ్ ప్రజాదరణను చూసి భయపడుతున్నారు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్ పుంగనూరు, జూన్ 3: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడం లేదా ఆయన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం ఎవరి వల్లా కాదని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్ విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ చేసిన ప్రయత్నాలకు అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాష్ట్ర నాయకుడు మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా యువత, ప్రజల్లో విశేష ఆదరణ పొందిన నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడి సభలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని, దేశంలో తిరగడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి కొందరు రాజకీయ నాయకులు భయపడుతున్నారని, అందుకే జనసేన పార్టీ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కూడా జనసేనకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక కొందరు నాయకులు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని, ప్రజల మద్దతుతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వాలు రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదని, ఇలాంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతాయని చైతన్య రాయల్ హెచ్చరించారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :