నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 27 : అన్నమయ్య జిల్లా రాయచోటి లో సంఘటన్ శ్రీజన్ అభియాన్ (సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ) కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ కె మహేంద్రన్ మరియు ఏపీసీసీ అబ్జర్వర్ అశోక రత్నం జిల్లా కార్యాలయంలో సమావేశమై కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏఐసీసీ ఆదేశాల మేరకు తమ విధి నిర్వహణలో భాగంగా జిల్లా మొత్తం ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను పునరుత్తేజపరిచి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పరిశీలన జరుగుతోందని అందులో భాగంగా డిసిసి పదవికి అర్జీలు స్వీకరిస్తామని అందులోని బలమైన నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది అని తెలిపారు. కావున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి అన్నమయ్య జిల్లా మదనపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ దరఖాస్తు చేసుకోవడమైనది. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఉన్నారు. వారు ఎక్కువ శాతం కాంగ్రెస్ వాదులు. ఆ కారణంగానే 2024 ఎన్నికలలో పార్లమెంటు అభ్యర్థి స్థానికుడు కాకపోయినా బాషీద్ అనే వ్యక్తి కి 53,300 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల వలన వచ్చాయి. కాబట్టి మైనార్టీల ప్రాబల్యంఉన్న జిల్లాలో మైనారిటీ అయిన నాకు డీసీసీ అద్యుక్షుడుగా అవకాశం ఇస్తే జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయమన్నా జిల్లా స్థాయిలో విజయవంతంగా నిర్వహిస్తాను. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని జిల్లాలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలేపేతం చేయడానికి, రాబోవు రోజుల్లో రాహుల్ గాంధీ ని ప్రధాని మంత్రిని చేయడానికి శక్తివంచన లేకుండా నా వంతు కృషి చేస్తానంటూ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ లు, అన్నమయ్య జిల్లా పీసీసీ కార్యవర్గం, రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు, మహిళా విభాగ నాయకులు, ఎస్ సి సెల్, బి సి సెల్, మైనారిటీ సెల్, సేవాదళ్, యువజన కాంగ్రెస్, ఎ న్ ఎస్ యు ఐ నాయకులు,ఐ ఎన్ సి సోషల్ మీడియా ( కోఆర్డినేటర్ ) నాయకులు మరియు కార్యకర్తలు అందరూ నా అభ్యర్తిత్వాన్ని బలపరుస్తారని కోరుతున్న రెడ్డి Almost
Admin
Namitha News