Monday, 27 July 2026 12:09:46 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు వెంకటరమణారెడ్డి

Date : 28 November 2025 08:01 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 28: 33 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అడిగిన రైతు పై వీఆర్వో వేధింపులకు పాల్పడడంతో ఆ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. బాధిత రైతు కుమారుడు ఆదినారాయణ రెడ్డి కథనం మేరకు.. గుర్రంకొండ మండలం, వెల్లుట్ల గ్రామం, ఇ పసలవాండ్ల పల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 421 లో 1.5 ఎకరా పొలాన్ని గత 33ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ స్థలానికి పట్టా ఇవ్వాలని పలుసార్లు అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. మరోసారి ఈ నెల 17న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు సదరు అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణ చేసి బాధితునికి పట్టా ఇవ్వాలని తహసిల్దార్ కు పంపారు. విచారణ చేసి పట్టా ఇచ్చేలా చూడాలని స్థానిక వీఆర్ఒ సదశివా నాయుడు ను ఆదేశించారు. దీంతో విఆర్వో భూమిని పరిశీలించి తనకు రూ.50 వేలు ఇస్తే త్వరగా పట్టా వచ్చేలా చూస్తానని చెప్పాడు. అయితే తమకు అంత స్తోమత లేదని కరుణించి ఈ పేద రైతుకు పట్టా ఇవ్వాలని రైతు వెంకటరమణా రెడ్డి కాళ్లా వేళ్లా పడినా కనికరించిన విఆర్వో పట్టా ఇవ్వకపోగా ఈ భూమిని ఖాళీ చేయాలని హెచ్చరించాడు. దీంతో రైతు వీఅర్ఒ ముందే పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాధితున్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుర్రంకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :