నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - జనవరి 23 : దేవర ఎద్దు మృతి చెందడం తో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు. చౌడేపల్లి మండలం లో సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండకు చెందిన దేవరెద్దు శుక్రవారం మరిమాకులపల్లి గ్రామంలో మృతి చెందింది. దేవర ఎద్దును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం పరిసర గ్రామ ప్రజల సమక్షంలో రాజనాల బండ అర్చకులు సాంప్రదాయబద్ధంగా అంతక్రియలు నిర్వహించారు
Admin
Namitha News