Monday, 27 July 2026 11:32:56 PM
# కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు

పీలేరు ను రెవిన్యూ డివిజన్ కేంద్రం గా ఏర్పాటు అవుతోందని కూటమి శ్రేణుల సంబరాలు

ఫలించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి కృషి

Date : 25 November 2025 08:34 PM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 25 : ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మదనపల్లి జిల్లా తో పాటు పీలేరు ను రెవెన్యూ డివిజన్ కేంద్రం గా చేస్తారని కాబినెట్ సబ్ కమిటీ తీర్మానం తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. గుర్రంకొండ బస్టాండ్ కూడలిలో బాణ సంచాలు పేల్చి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో మదనపల్లి, పీలేరు, పుంగనూరు తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజలకు అనుకూలంగా ఇచ్చిన హామీలు నెరవేర్చారని అన్నారు. మదనపల్లి జిల్లా తో పాటు పీలేరు ను రెవెన్యూ డివిజన్ కేంద్రం అవడం కోసం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పలుసార్లు విన్నవించడం తోపాటు అసెంబ్లీ లో సైతం తన బాణిని వినిపించారని, అహర్నిశలు ఆయన చేసిన కృషి ఫలించిందని, పీలేరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలే పరమాదిగా పని చేస్తున్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి కూటమి శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, అనుబంధ సంఘాలు, నల్లారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :