నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 25 : ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మదనపల్లి జిల్లా తో పాటు పీలేరు ను రెవెన్యూ డివిజన్ కేంద్రం గా చేస్తారని కాబినెట్ సబ్ కమిటీ తీర్మానం తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. గుర్రంకొండ బస్టాండ్ కూడలిలో బాణ సంచాలు పేల్చి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో మదనపల్లి, పీలేరు, పుంగనూరు తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజలకు అనుకూలంగా ఇచ్చిన హామీలు నెరవేర్చారని అన్నారు. మదనపల్లి జిల్లా తో పాటు పీలేరు ను రెవెన్యూ డివిజన్ కేంద్రం అవడం కోసం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పలుసార్లు విన్నవించడం తోపాటు అసెంబ్లీ లో సైతం తన బాణిని వినిపించారని, అహర్నిశలు ఆయన చేసిన కృషి ఫలించిందని, పీలేరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలే పరమాదిగా పని చేస్తున్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి కూటమి శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, అనుబంధ సంఘాలు, నల్లారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News