Sunday, 26 July 2026 02:47:56 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

టీబీ ముక్త్ భారత్ అభియాన్, డెంగీ మాసోత్సవాలను విజయవంతం చేద్దాం: డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ

Date : 14 July 2026 06:18 PM Views : 72

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టీబీ ముక్త్ భారత్ అభియాన్, డెంగీ మాసోత్సవాలను విజయవంతం చేద్దాం: డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ / గుర్రంకొండ: టీబీ ముక్త్ భారత్ అభియాన్, డెంగీ మాసోత్సవాలు, స్టాప్ డయేరియా కార్యక్రమాలు, జనాభా దినోత్సవ వారోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో ప్రభావితం విజయవంతం చేయాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు గుర్రంకొండ మండలం తరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మర్రిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మర్రిపాడు సచివాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులు, ప్రజలకు డెంగీ, క్షయవ్యాధి, అతిసార వ్యాధులు, జనాభా సమతుల్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగాకు, మద్యం అలవాట్లు ఉన్నవారు, గతంలో టీబీ బారినపడి కోలుకున్నవారు, హెచ్‌ఐవీ బాధితులు, గర్భిణులు, మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరు నెలలపాటు ఉచిత చికిత్సతో పాటు ప్రతి నెల రూ.1,000 చొప్పున పౌష్టికాహారం కోసం ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. టీబీ రోగులకు పౌష్టికాహారం అందించేందుకు 'పోషణ్ మిత్రలు' ముందుకు రావాలని కోరారు. జూలై నెలను డెంగీ వ్యతిరేక మాసోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలను మూతలతో కప్పివేయడం, కిటికీలకు మెష్ అమర్చడం, సాయంత్రం వేళ పచ్చి వేపాకు పొగ వేయడం, కాలువల్లో చెత్త వేయకుండా ఉండడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని వివరించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రత, మరుగుదొడ్ల వినియోగం, ఓఆర్‌ఎస్ వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. జనాభా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అర్హులైన దంపతులకు కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, పిల్లల మధ్య తగిన వ్యవధి పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించవచ్చని సూచించారు. అనంతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ, ఎమ్‌పీహెచ్‌ఈఓ హరినాథ్, పర్యవేక్షకురాలు సుజాత, ప్రధానోపాధ్యాయురాలు అరుణ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: