నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 05 : అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. లక్ష్మీ నరసయ్య ఈ రోజు మదనపల్లి పట్టణం లోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ను పూర్తిగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందించబడవు అని స్పష్టంగా తెలియజేస్తూ ఓ బ్యానర్ ను ఏర్పాటు చేసిన జిల్లా వైద్యాశాఖ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఉత్తర్వులు కూడా ఆసుపత్రి గేటు కు అతికించిన వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో డా. విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకర్, శాంతి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News