నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లయ్య కొండల్లో కేవలం ఖనిజాల సర్వే మాత్రం నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ సహకరించాలని మైనింగ్ అధికారి సత్యనారాయణ నాయకులను కోరగా టిడిపి నాయకులు పవిత్రమైన మల్లయ్య కొండల్లో స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మైనింగ్ చేపట్టి తంబళ్లపల్లెను రెండో ఓబులాపురం చేయకండిని అధికారులను కోరారు. బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాసిల్దార్ శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి, మైనింగ్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మల్లయ్య కొండ మైనింగ్ సర్వే పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైనింగ్ అధికారి ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లయ్య కొండల్లో ఖనిజాల అన్వేషణ కోసం సర్వే జరుపుతున్నామని మైనింగ్ ఇప్పట్లో చేపట్టమని అపోహలు నమ్మద్దని కేవలం సర్వే మాత్రమే జరుపుతామన్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ తంబళ్లపల్లె అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మల్లయ్య కొండల మైనింగ్, రెడ్డి కోట వద్ద పారిశ్రామిక వాడ,ద్వారా తంబళ్లపల్లె పారిశ్రామిక అభివృద్ధి తో పాటు మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కలిగి నిరుద్యోగ సమస్య తీరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సర్వేకు సహకరించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి మాట్లాడుతూ ప్రభుత్వం మల్లయ్య కొండల్లో ఖనిజాల సర్వే కి అనుమతి ఇచ్చిందని ఇందుకు మైనింగ్ అధికారుల ను అడ్డుకోరాదని అందరూ సహకరించి ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మల్లయ్య కొండ మాజీ చైర్మన్ గంగుల్ రెడ్డి లు మాట్లాడుతూ మైనింగ్ చేయమని సర్వే మాత్రం ఎందుకు చేయాలని మాకు అవసరం లేదని మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాదిమంది ఆరాధ్య దైవం మహాశివుని భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆక్షేపించారు. గత కాంగ్రెస్ పాలనలో మేము ఓబులాపురం మైనింగ్ పర్యటనలో అక్కడి వారి దుర్భర పరిస్థితులు ప్రత్యక్షంగా అక్కడి రైతులు, ప్రజల పడుతున్న అవస్థలను చూసామని అలాంటి పరిస్థితి మా తంబళ్లపల్లె ప్రాంత ప్రజలకు రాకూడదని ఇందులో ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారని ఖరాఖండిగా చెప్పారు. పర్యావరణం పూర్తిగా నాశనమై పంటలు పండే పరిస్థితి లేదని, దుమ్ము ధూళి తప్ప ప్రజలు జీవించే పరిస్థితి లేదని అలాంటి దుర్గతి మా ప్రాంత ప్రజలకు వద్దని చెప్పారు. అధికారులు మరో మారు సబికులకు మల్లయ్య కొండ సర్వేపై సహకరించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అయితే హాజరైన సభ్యులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తామని మల్లయ్య కొండల్లో మైనింగ్ కు అప్పజెప్పరాదని తిరుగు ముఖం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అనిల్ కుమార్, రెవిన్యూ అధికారులు, టిడిపి నాయకులు కాలా నారాయణ, పురుషోత్తం, కసెట్టి వెంకటరమణ, సురేంద్ర, బాలరాజు, వీరాంజనేయులు, నరసింహులు, మధు నాయుడు, నరేంద్ర నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News