Sunday, 26 July 2026 08:09:31 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

విద్యాశాఖ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలలకి ఇబ్బందికరం

హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం సబబు కాదు - ఎంఈఓకి పలువురు కరస్పాండెంట్ల వినతి

Date : 14 May 2026 03:00 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యాశాఖ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలలకి ఇబ్బందికరం - హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం సబబు కాదు - ఎంఈఓకి పలువురు కరస్పాండెంట్ల వినతి మదనపల్లె : ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఆయా పాఠశాలల కరస్పాండెంట్ల ప్రమేయం లేకుండా యుడైస్ నందు తొలగించడం,టీసిలు మంజూరు చేయాలనడం వంటి విద్యాశాఖ నిర్ణయాలు ప్రైవేటు పాఠశాలలకు తీవ్రం నష్టం కలిగిస్తాయని విద్యోదయ కరస్పాండంట్ శ్రీనివాసులు నాయుడు,న్యూ లిటిల్ ఫ్లవర్ రామకృష్ణ రెడ్డి,సాయి విద్యానికేతన్ శ్రీనివాసరావు,బ్రహ్మర్షి,కేశవ రెడ్డి,ఎస్విఎల్ ప్రవీణ్,డైమండ్ చక్రపాణి,విజేత శ్రీనివాస శర్మలు పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం మండల విద్యాశాఖ అధికారి ఎం.ప్రభాకర్ రెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సుప్రీం కోర్టు ఏదైనా విద్యార్థి ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలకు మారాలంటే,బ్యాలెన్స్ ఉన్న ఫీజులో కనీసం 50 శాతం చెల్లించి టీసీలు తీసుకోవాలని మరియు మిగతా బ్యాలెన్స్ మొత్తాన్ని ఆరు విడతలలో చెల్లించాలని తీర్పు ఇచ్చిందన్నారు.అనంతరం ఆయా కరెస్పాండెంట్ల అనుమతితో విద్యార్థి చేరే ప్రభుత్వ/ప్రవేటు పాఠశాలల చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.అయితే ప్రస్తుతం విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే కరస్పాండెంట్ల అనుమతి అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేయడం అభ్యంతరకరమన్నారు.ఇటువంటి నిర్ణయాలు ప్రైవేట్ పాఠశాలల మనుగడకు ప్రమాదకరమన్నారు.ఈ నిర్ణయంపై మండల విద్యాశాఖ,జిల్లా విద్యాశాఖ అధికారులు పునరాలోచించాలని,తమ విజ్ఞప్తిని రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: