నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యాశాఖ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలలకి ఇబ్బందికరం - హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం సబబు కాదు - ఎంఈఓకి పలువురు కరస్పాండెంట్ల వినతి మదనపల్లె : ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఆయా పాఠశాలల కరస్పాండెంట్ల ప్రమేయం లేకుండా యుడైస్ నందు తొలగించడం,టీసిలు మంజూరు చేయాలనడం వంటి విద్యాశాఖ నిర్ణయాలు ప్రైవేటు పాఠశాలలకు తీవ్రం నష్టం కలిగిస్తాయని విద్యోదయ కరస్పాండంట్ శ్రీనివాసులు నాయుడు,న్యూ లిటిల్ ఫ్లవర్ రామకృష్ణ రెడ్డి,సాయి విద్యానికేతన్ శ్రీనివాసరావు,బ్రహ్మర్షి,కేశవ రెడ్డి,ఎస్విఎల్ ప్రవీణ్,డైమండ్ చక్రపాణి,విజేత శ్రీనివాస శర్మలు పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం మండల విద్యాశాఖ అధికారి ఎం.ప్రభాకర్ రెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సుప్రీం కోర్టు ఏదైనా విద్యార్థి ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలకు మారాలంటే,బ్యాలెన్స్ ఉన్న ఫీజులో కనీసం 50 శాతం చెల్లించి టీసీలు తీసుకోవాలని మరియు మిగతా బ్యాలెన్స్ మొత్తాన్ని ఆరు విడతలలో చెల్లించాలని తీర్పు ఇచ్చిందన్నారు.అనంతరం ఆయా కరెస్పాండెంట్ల అనుమతితో విద్యార్థి చేరే ప్రభుత్వ/ప్రవేటు పాఠశాలల చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.అయితే ప్రస్తుతం విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే కరస్పాండెంట్ల అనుమతి అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేయడం అభ్యంతరకరమన్నారు.ఇటువంటి నిర్ణయాలు ప్రైవేట్ పాఠశాలల మనుగడకు ప్రమాదకరమన్నారు.ఈ నిర్ణయంపై మండల విద్యాశాఖ,జిల్లా విద్యాశాఖ అధికారులు పునరాలోచించాలని,తమ విజ్ఞప్తిని రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.
Reporter
Namitha News