నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన అధ్యాపకులతో కళకళలాడుతున్న బీటీ కళాశాల కళాశాల పూర్వ వ8భావానికి సమష్టిగా కృషి చేద్దాం: ప్రిన్సిపాల్ డా. గన్నవరం శ్రీదేవి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అధ్యాపకుల బదిలీల్లో భాగంగా స్థానిక చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదుగురు నూతన అధ్యాపకులు బదిలీపై వచ్చి శుక్రవారం విధుల్లో చేరారు. దీంతో కళాశాలలో అధ్యాపకుల సంఖ్య పెరిగి విద్యా వాతావరణం మరింత బలోపేతమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. గన్నవరం శ్రీదేవి నూతన అధ్యాపకులకు స్వాగతం పలికారు. విద్యార్థుల ప్రవేశాల పెంపుతో పాటు కళాశాల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అందరూ సమిష్టిగా కృషి చేసి కళాశాల పూర్వ వైభవానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బదిలీపై కామర్స్ అధ్యాపకురాలు డా. వి. కృష్ణవేణి, హార్టికల్చర్ అధ్యాపకులు డా. పి. రవీంద్రనాథ్ రెడ్డి, భౌతిక శాస్త్ర అధ్యాపకులు డా. ఎస్. గురుప్రసాద్, రసాయన శాస్త్ర అధ్యాపకులు టి. బాలాజీ, ఎల్. ప్రదీప్ కళాశాలలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు, కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎం. రాఘవరెడ్డి, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు డా. శైలజ సి.ఎస్., తెలుగు అధ్యాపకులు డా. డేరంగుల శ్రీనివాసులు, రసాయన శాస్త్ర అధ్యాపకులు డా. జి. చిన్నారెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News