నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతదేశ చదువుల తల్లి మాత సావిత్రిబాయి పూలే. (బహుజన సేన). సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల నందు (మదనపల్లి), తొలి చదువుల తల్లి,భారతీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే కి బహుజన సేన రాష్ట్ర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సేన నాయకులు వి.భాను ప్రకాష్ మాట్లాడుతూ మహిళలు విద్యా రంగంలోను అన్ని రంగాలలో సమాన హక్కులు అవకాశాలు కల్పించాలని సావిత్రిబాయి ఫూలే గారు ఎన్నో పోరాటాలు చేశారని.తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారని. ఆమె ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు.పీడిత ప్రజల ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో డిగ్రీ మహిళా కళాశాల వనజా మాట్లాడుతూ కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని ఆమే కొనియాడరు. ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు జయశంకర్,రాఘవ యాదవ్,చైతు మరియు మహిళ కళాశాల ప్రిన్సిపాల్ సూర్య శేఖర్,వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు,వనజా,విష్ణుప్రియ,మోహనవల్లి,జ్యోతి,గురుమూర్తి,కుసుమ ప్రియా,మజీరా కమ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News