Sunday, 26 July 2026 12:20:44 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మల్లయ్య కొండ శైవ క్షేత్రానికి ఐదోసారి పుష్పాలంకరణ చేసిన నల్లగుండ్ల హేమలత, మల్లికార్జున రెడ్డి దంపతులు

Date : 14 February 2026 09:26 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 14 ః తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ శైవ క్షేత్రానికి ఐదోసారి పుష్పాలంకరణ చేసే భాగ్యం మా కుటుంబానికి దక్కడం పూర్వజన్మ సుకృతమని గోపిదిన్నె పంచాయతీ చెరువు ముందరపల్లి కు చెందిన రియల్టర్(బెంగళూరు మల్లి) నల్ల గుండ్ల మల్లికార్జున రెడ్డి, హేమలత దంపతులు కొనియాడారు. ప్రతి ఏటా సుమారు ఐదు లక్షల ఖర్చుతో ఆలయంలో బెంగళూరు నుండి వందలాది రకాల ఫల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఓ సామాన్య రైతుబిడ్డగా జీవితం ప్రారంభించిన మల్లికార్జున రెడ్డి శివయ్య సేవలో తరించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదగడానికి మల్లయ్య కొండ మహా శివుడే విజయ సోపానంగా నిలవడంతో ఆ కుటుంబం దశాబ్ద కాలంగా వేలాది మందికి కులం, మతం, ప్రాంతం, పార్టీలకతీతంగా తంబళ్లపల్లె నుండి బెంగుళూరు వరకు ఆపన్న హస్తం అందించి నిరుపేదలు, అభాగ్యులకు, తనకున్నంతలో ఆర్థిక సహాయం చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలవడం ప్రశంసనీయమని సర్వత్ర హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి, హేమలత దంపతులు మాట్లాడుతూ మా కుటుంబం ఈ స్థాయికి చేరడానికి మల్లయ్య కొండ మహాశివుడేనని ఆయన ఆశీస్సులతో భవిష్యత్తులో సైతం శక్తి వంచన లేకుండా నిరుపేదలకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించి తంబళ్లపల్లె ప్రాంత ప్రజలు పాడి పంటలు, సుఖ సంతోషాలతో జీవించాలని ఆ పార్వతీ పరమేశ్వరులను ఆకాంక్షించినట్లు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: