Sunday, 26 July 2026 09:20:07 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం

ఓట్ల కోసం ప్రజలకు మాయమాట్లే తప్ప అభివృధి ఎక్కడ - సిపిఐ మండల కార్యదర్శి డి రెడ్డి శేఖర్

Date : 17 April 2026 07:55 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *చెంబకూరు నుండి మదనపల్లి మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన APSRTC బస్సు. చెంబకూరు రోడ్డు పట్ల పాలకులకు చిత్తశుద్ధి ఏది ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం ఓట్ల కోసం ప్రజలకు మాయమాట్లే తప్ప అభివృధి ఎక్కడ? సిపిఐ మండల కార్యదర్శి డి రెడ్డి శేఖర్ మదనపల్లి నుండి రామసముద్రం పోవు ప్రధాన రహదారి పెంచుపాడు సమీప ప్రాంతం రెక్కమాను వద్ద ఆర్టిసి బస్సు పంటపొలాలులోకి దూసుకుపోయిందని,గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లి నుండి రామసముద్రం పోవు రోడ్డు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుందని సిపిఐ మండల కార్యదర్శి డి రెడ్డి శేఖర్ ఆవేదన వ్యక్తంచేశారు. మదనపల్లి నుండి చెమ్మకూరు పోవు ప్రధాన రహదారి ప్రమాదకర మలుపులు ఉన్నవి,రోడ్డు మొత్తం గుంతల మాయమైపోయిందని,ఆసియా ఖండంలోనే మదనపల్లె టమోట మార్కెట్ ప్రసిద్ధిగాంచిందని,ఇలాంటి టమోటా మార్కెట్ కు పెంచుపాడు, చెం బుకూరు,రామసముద్రం ఈ ప్రాంతాల నుండి సుమారు 50% పైన పండిస్తారని, ఈ ప్రాంతంలో పండించిన టమోటా మొత్తం ఈ ప్రమాదకరమైన రోడ్డుపైనే రవాణా జరగాలని,రోజుకు కొన్ని వందల లోడ్లు ఈ రోడ్డు మీదనే మదనపల్లి మార్కెట్ కు తరలిస్తారని, రోజువారి కొన్ని వేల మంది ఉపాధి కోసం మదనపల్లి పట్టణానికి ఎదే రోడ్డుపైన ప్రయాణం చేస్తారని,ఇలాంటి రోడ్డుకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేంబకూరు రోడ్డు పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదని,ఈ రోడ్డుకు డబుల్ రోడ్డు ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ సీపీఐ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్లు కార్యక్రమాలు చేపట్టిన ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి మదనపల్లి నుండి రామసముద్రం వరకు డబుల్ రోడ్డు చేయాలని డిమాండ్ చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :