నమిత న్యూస్ - Andhra Pradesh / అనంతపురం : నార్పల - మే 10 : అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీధర్ గారు అరటి పంట సాగు చేసి సంవత్సరం పైగా కష్టపడి పెంచి చేతికి వచ్చిన పంట , విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు సార్లు పంట కాలిపోయి రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లింది. వెంకటం పల్లి నుండి మడుగుపల్లి వరకు దాదాపు 250 ట్రాన్స్ఫార్మర్లకు వెళ్లే విద్యుత్ లైన్కు చాలా చిన్న వైర్లు ఉపయోగించడం వల్ల తరచూ వైర్లు కాలిపోతున్నాయని రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు. సమస్య తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతు తీవ్రంగా నష్టపోయాడని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కడపం దామోదర్ గారు మండిపడ్డారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యుత్ అధికారుల వైఖరి వెంటనే మారకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతుకు జరిగిన పూర్తి నష్టాన్ని అంచనా వేసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులైన AE, AD అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు పంటలు కాలిపోతుంటే కార్యాలయాల్లో కూర్చుని నిర్లక్ష్యం చేసే అధికారులను ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, SC మోర్చా మండల అధ్యక్షులు గంగాధర్ , మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News