నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జనవరి 14 : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ (పిపిపి) పేరుతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు కంకణం కట్టుకుని 590,847 జీవోలను తీసుకువచ్చిందని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. భోగి పండుగను పురస్కరించుకొని బుధవారం ఉదయం ఐదు గంటలకు స్థానిక పిటిఎం రోడ్డు నందు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగిమంటలను వేసి అందులో 590,847 జీవో ప్రతులను దగ్ధం చేశారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం మానుకోవాలని,తక్షణం ప్రజా వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని,పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం మానుకోవాలని,పిపిపి విధానాన్ని రద్దు చేయాలని,ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడపాలని,కూటమి ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా యస్.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ; నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు కోసం భూములు,భవనాల నిర్మాణం,వనరులు,మౌళిక సదుపాయాలతో పాటు సిబ్బందికి వేతనాలు కూడా ప్రభుత్వమే చెల్లించి కళాశాలల నిర్వహణను మాత్రం పిపిపి పేరుతో ప్రైవేటుకు అప్పగించడం ఎంతవరకు సబబో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు మొండిగా వ్యవహరించడం చూస్తుంటే ఇది "కూటమి ప్రభుత్వం" కాదని ఇది "కాళకూటమి ప్రభుత్వమని" ఘాటుగా విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎస్. తంబయ్యశెట్టి,ఎం.అష్రఫ్అల్లీ,పి.మంజునాథ్,జి. నారాయణస్వామి,ఎం. గంగులప్ప,హబీబ్, రామచంద్ర,షఫీ,రెడ్డప్ప, గంగాధర్,కిట్టన్న, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News