నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 13 : తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్య కొండ మహాశివరాత్రి ఉత్సవాలకు కొండ కింద నుండి కొండ పైకి 37 సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులు నడుపుతున్నట్లు మదనపల్లి వన్ డిపో మేనేజర్ రమణారెడ్డి విలేకరులకు తెలిపారు. 15వ తేదీన శ్రీ శక్తి యధావిధిగా కొనసాగుతుందని మదనపల్లి నుండి తంబళ్లపల్లె కొండ కిందికి 20 సర్వీసులు, తంబళ్లపల్లె బస్టాండు నుండి కొండ కిందికి ఆరు సర్వీసులు, బీ కొత్తకోట నుండి 3 సర్వీసులు, ములకలచెరువు నుండి రెండు సర్వీసులు,పెద్ద మండలం నుండి తంబళ్లపల్లెకు మూడు సర్వీసులు తిరుగుతాయన్నారు. శ్రీ శక్తి మహిళల ఉచిత ప్రయాణం కొనసాగుతుందని ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసులకు సహకరించాలని ఓ ప్రకటనలో కోరారు. ఆయన వెంట ఆర్టీసీ సిబ్బంది బాబ్జి తదితరులు ఉన్నారు.
Reporter
Namitha News