నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మార్చి 27 : అంగళ్ళు సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ లో అశ్వ్–2కె26 రెండు రోజుల జాతీయ స్థాయి టెక్నో, కల్చరల్, స్పోర్ట్స్ ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి ప్రారంభించారు. 1998 సంవత్సరం లో మదనపల్లి బెంగుళూరు రోడ్డు లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల అని, మదనపల్లి తో పాటు పరిసర ప్రాంతాల వారికి అనువుగా ఉండడం తో మిట్స్ ప్రస్థానం మొదలు, ఆనాటి నుండి అంచెలు అంచేలుగా ఎదిగి నేడు యూనివర్సిటీ స్థాయికి రావడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. మిట్స్ కు A+ గ్రేడ్ రావడం అభినందనీయం అని అన్నారు. తమ యూనివర్సిటీ లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో ముక్యంగా అత్యుత్తమ మల్టీనేషనల్ కంపెనీలలో వివిధ రాష్ట్రాల లో పనిచేస్తున్నారని, అంతేకాకుండా ఎంతో అత్యుత్తమ స్థానాలలో ఉన్నారని, వారి కలయిక కోసం బెంగళూరు మరియు హైదరాబాద్ లో అల్యూమిని మీట్ నిర్వహించడం జరిగినది అని అన్నారు. కార్యక్రమంలో 1998 సంవత్సరం నుండి 2025 వరకు చదివిన విద్యార్థులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు అని అన్నారు. మిట్స్ విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడాన్ని అభినందిస్తూ, ఇలాంటి వేడుకలు వారి జీవితంలో చిరస్మరణీయ జ్ఞాపకాలను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ గాయకులు సాగర్, లిప్సిక భాష్యం, మౌనిక యాదవ్, అలాగే సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అలరించారు. “రాకాస” సినిమా ట్రైలర్ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. రెండవ రోజు సినీ నటుడు శర్వానంద్ మరియు నటి మాళవిక నాయర్ విద్యార్థులతో మమేకమై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. జబర్దస్త్ కళాకారుల హాస్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక మరియు నృత్య కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు వివిధ ఆట పాటలతో మరియు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన “రామాయణం” నాటికకు ప్రేక్షకుల ప్రశంసలు లభించగా, ఉత్తమ ప్రదర్శనగా గుర్తించి ఛాన్సల్లర్ రూ.50,000 నగదు బహుమతిని అందజేశారు. మొత్తం ఫెస్ట్ విజయవంతంగా ముగిసి, విద్యార్థులకు చిరస్మరణీయ అనుభవాలను అందించింది
Reporter
Namitha News